పత్రాలు

Friday, August 6, 2010

కధ చెపుతాను వూ కొడతారా...ఒకటి

ఏం చేద్దాం ఇది కలికాలం కదా. నమ్మిన వాళ్ళే మోసం చెసే కాలం. ఈ కధలో కథా నయకుఢు భూనాధ్. ప్రతి నాయకుడు మన ప్రభుత్వం. కలియుగం కనుక విజయం ప్రతి నాయకునిదే. ఆఛ్చర్యపొకండి. సత్య, త్రెతా, ద్వాపర యుగాల్లో విజయం కథానాయకులది మరి కలియుగంలో విజయం ప్రతి నాయకులది. మరువకండి కథానా యకులు గెలిచేది చలన చిత్రాల్లోనే కాని వాస్తవాల్లోకాదు. అందుకే ఎక్కువమంది చలన చిత్రాలు బహుగా చూస్తుంటారని నాకనిపిస్తుంది. ఇక కథలోకి...., వినండి.

మనకథానయకుడిది, ఒక చిన్న పల్లెటూరు. పుట్టగానే మన వాడికి ఏం పేరు పెట్టాలో తల్లిదండ్రులకు అర్థం కాలేదు. తల్లిదండ్రుల తీరని కోర్కెలని తీర్చేవాళ్ళు పిల్లలని ఎవరో చెప్పారు. ఇకనేం మనవాళ్ళకు భూమి లేదనే తీరని కోరిక ఒకటుంది, అంచేత మనవాడికి భూనాద్ అనే పేరు ఖరారు చేశారు. చిన్నగా మనవాడు పెద్దవాడవుతున్నాడు. మనవాడిని సార్ధకనామదేయున్ని చేయడానికి రోజుకొక గొప్పవారి కధలన్నీ చెప్పడం ప్రారంభించారు తల్లిదండ్రులు. మనవాడు క్షణ క్షణ ప్రవర్ధమానుడవుతున్నాడు. తరగతి గదిలో కూడా అమనవాడికి రుచ్యమైన విషయం భూగోళ శాస్త్రమే.

No comments:

Post a Comment